ప్రముఖ సినిమాటోగ్రాఫర్, మూడు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న శివన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుమారులు తెలిపారు. శివన్కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
శివన్ రెండో కుమారుడు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్గానే పని చేస్తున్నారు.మిగిలిన ఇద్దరు కుమారులు సంగీత్, సంజీవ్ కూడా సినీ రంగంలోనే స్థిరపడ్డారు. శివన్ మృతి అందరిని షాక్కి గురి చేసింది. ఆయన మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ అహ్మద్ ఖాన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.నిర్మాతగా, దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు శివన్.