పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్(98:106 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సర్లు) శతకానికి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. 90 పరుగుల వరకూ వేగంగా బ్యాటింగ్ చేసిన ధావన్ సెంచరీకి చేరువలో ఒత్తిడిలోనయ్యాడు. 100 మార్క్ చేరే క్రమంలో నిదానంగా ఆడాడు. బెన్స్టోక్స్ వేసిన 39వ ఓవర్ తొలి బంతిని షాట్ ఆడిన ధావన్ మిడ్వికెట్లో మోర్గాన్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ చివరి 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయింది.
ఆరంభం నుంచి ఏ దశలోనూ ఇబ్బంది పడని గబ్బర్ చక్కటి భాగస్వామ్యాలను ఏర్పరుస్తూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హాఫ్సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. విరాట్ కోహ్లీతో కలిసి వందకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ధావన్..రోహిత్ శర్మతో తొలి వికెట్కు 64 రన్స్ జోడించాడు.