పుణె: ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మనే ఓపెనింగ్ చేయనున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. మంగళవారం నుంచి పుణెలో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోంది. కచ్చితంగా ధావన్, రోహితే ఓపెన్ చేస్తారు. వన్డేల విషయంలో ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. వాళ్లు కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నారు అని కోహ్లి మ్యాచ్కు ముందు రోజు జరిగే వర్చువల్ ప్రెస్ మీట్లో అన్నాడు. టీ20ల్లో ఓపెనర్గా విఫలమైన ధావన్కు వన్డే సిరీస్ కీలకం కానుంది. పైగా అతనికి పోటీ కూడా చాలానే ఉంది. శుభ్మన్ గిల్, పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్ రూపంలో ధావన్కు ముప్పు పొంచి ఉంది. ఇప్పటి వరకూ చూస్తే ఇండియా తరఫున రోహిత్, ధావన్ది మూడో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ. వీళ్లు 109 ఇన్నింగ్స్లో 44.87 సగటుతో 4878 పరుగులు చేశారు. అందులో ఓపెనర్లుగా 107 ఇన్నింగ్స్ల్లో 4802 పరుగులు చేశారు. ఇది ఇండియా తరఫున వన్డే క్రికెట్లో సెకండ్ బెస్ట్. గతంలో సచిన్, గంగూలీ ఓపెనింగ్ జోడీ 6609 పరుగులు చేసింది.