న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్గా ఉద్వాసనకు గురైనప్పటి నుంచి ఆ సంస్థ యాజమాన్యంపై మండి పడుతున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్కు చెందిన సైరస్ మిస్త్రీ తాజాగా వ్యూహం మార్చారు. 2016లో టాటా సన్స్ చైర్మన్గా మిస్త్రీని తొలగిస్తూ టాటా సన్స్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. అయితే, తమ సంస్థలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వాటా విలువ కేవలం రూ.80 వేల కోట్లేనని టాటా సన్స్ వాదిస్తున్నది. అది తప్పని.. తమకు రూ.1.75 లక్షల నిధులు రావాలని ఎస్పీ గ్రూప్ వాదన
ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (ఎస్పీ) తమ భవిష్యత్ బిజినెస్ ప్రయోజనాలను కాపాడుకునేందుకు టాటా సన్స్లోని తమ 18.4 శాతం వాటాలను విక్రయించాలని తొలుత ప్రణాళిక రూపొందించినట్లు వినికిడి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రణాళికను సైరస్ మిస్త్రీకి చెందిన ఎస్పీ గ్రూప్ పక్కనబెట్టినట్లు ఆయన సన్నిహిత వర్గాల కథనం.
తాము తీసుకున్న రుణాల మొత్తం రూ.10,900 కోట్ల రుణాలను వన్టైం డెట్ రీస్ట్రక్చరింగ్కు అనుమతించాలన్న ఎస్పీ గ్రూప్ ప్రతిపాదనకు ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ సారధ్యంలో ఆర్బీఐ నియమించిన కమిటీ ఆమోదించింది. దీంతో టాటా గ్రూప్లో తమ వాటాల ఉపసంహరణ నెమ్మదిగా తీసుకెళ్లాలని ఎస్పీ గ్రూప్ భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, టాటా సన్స్ సైతం ఇప్పటికిప్పుడు వాటాల కొనుగోలుకు సిద్ధంగా లేదని సమాచారం. భవిష్యత్ బిజినెస్ అవకాశాలను బలోపేతం చేయడానికి అంతర్గతంగా అవసరాలను పరిష్కరించడంపైనే టాటా సన్స్ బోర్డు శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తున్నది.
ఎస్పీ గ్రూప్కు అత్యంత సన్నిహితులైన లీగల్ ఎగ్జిక్యూటివ్ స్పందిస్తూ.. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వాటా క్లయిమ్ల అంశం తేలడానికి ఐదేండ్ల వరకు టైం పడుతుందని అంచనా వేశారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో