అమరావతి : కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం పర్సన్ ఇన్ఛార్జిగా శంకర్ బాలాజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మఠం కార్యాలయంలో ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆలయ మేనేజర్ ఈశ్వరాచారి నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కడప దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న శంకర్ బాలాజీని బ్రహ్మంగారిమఠం పర్సన్ ఇన్ఛార్జిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఠాధిపతి వివాదం నేపథ్యంలో సర్కార్ ఆయనకు మఠం బాధ్యతలను అప్పగించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.