ఎనిమిదో రోజుకు చేరిన శాకంబరీ ఉత్సవాలు
ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పూజలు
వరంగల్, జూలై 7 : చారిత్రక మహా నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు గురువారం అమ్మవారు త్వరితామాత క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
చారిత్రక రోజు : కమల్చంద్రభంజ్దేవ్
ఈ రోజు చారిత్రకమని కాకతీయుల వారసుడు, బస్తర్ మహారాజు కమల్చంద్రభంజ్ దేవ్ అన్నారు. భద్రకాళి ఆలయాన్ని గురువారం ఆయన సందర్శించి విజిటర్స్ బుక్లో రాశారు. కాకతీయ వంశస్తుల మూలాలు ఉన్న వరంగల్ నగరానికి వచ్చే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ఇవి అద్భుత క్షణాలని విజిటర్ బుక్లో పేర్కొన్నారు.