న్యూఢిల్లీ: ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా జింబాబ్వే టూర్కు దూరం అయ్యాడు. ఆగస్టు 18వ తేదీ నుంచి జింబాబ్వేతో వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. అయితే సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్లో కౌంటీ గేమ్ ఆడుతున్న సమయంలో సుందర్ గాయపడ్డాడు. గురువారం హరారేలో తొలి వన్డే మ్యాచ్ను ఆడనున్నది. ఆ తర్వాత ఇదే వేదికపై శని, సోమవారాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఐపీఎల్ 2022లోనూ 27 ఏళ్ల షాబాద్ అద్భుతంగా రాణించాడు. ఆర్సీబీ తరపున అతను ప్రాతినిధ్యం వహించాడు.