షాబాద్ : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. ఆదివారం చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో శంకర్పల్లి మండలానికి చెందిన నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డితో పాటు 50 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ తెలంగాణలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ పరిశుభ్రంగా మార్చడంతో రూపురేఖలు మారిపోవడం జరిగిందన్నారు.
పార్టీ అన్ని విధాలుగా ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ నెల 13నుంచి 18వరకు మండలాల కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనుభవం ఉన్న వ్యక్తులను, పార్టీ కోసం పనిచేసే నాయకులను మండల కమిటీలో నియమించాలన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి మండలాల కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన్నట్లు వివరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించి, నేడు బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. సీఎంపై కొంతమంది అవగాహన లేని నాయకులు, స్థాయిలేని వాళ్లు ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు.
అధికారం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు గులాబీ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఐదు మండలాలకు చెందిన టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఏర్పాటు పత్రాలను ఇన్చార్జికి అందజేయడం జరిగిందన్నారు. ఈ నెల 20వ తేది వరకు మండల కమిటీలు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. సీఎంను, మంత్రులను, ఎమ్మెల్యేలను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, గోవర్ధన్ రెడ్డి, ఆయా మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్రావు, మహేందర్రెడ్డి, గోపాల్, నాగిరెడ్డి, సీనియర్ నాయకులు పోలీస్ రాంరెడ్డి, సాత ప్రవీణ్కుమార్, కొంపల్లి అనంతరెడ్డి, వెంకట్రెడ్డి ఉన్నారు.