చాంద్రాయణగుట్ట, నవంబర్ 25: మంత్రాలు చేసి.. కష్టాలు తొలగిస్తామంటూ..నమ్మించి ఇద్దరు యువతులపై లైంగికదాడి చేసిన తండ్రీకొడుకులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజారావు భూపాల్ వివరాలు వెల్లడించారు. చంచల్గూడకు చెందిన సయ్యద్ హసన్ హస్కారి(52), అతడి కుమారుడు ఓల్డ్ మలక్పేట రైతుబజార్ సమీపంలో నివసించే సయ్యద్ అఫ్రోజ్(23) మంత్రాలతో ఇబ్బందులు తొలగిస్తామని ప్రజలను నమ్మించి.. పూట గడుపుకొంటున్నారు.
ఈ క్రమంలో బండ్లగూడ తులసినగర్కు చెందిన ఓ యువతి (23) ఆరోగ్యం బాగలేకపోవడంతో సయ్యద్ హసన్ హస్కారి వద్దకు వెళ్లింది. ఎవరో కుట్ర చేశారని, ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని ఇలా రకరకాలుగా చెప్పి..నాలుగేండ్లుగా ఆమెను నమ్మిస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆమె తన స్నేహితురాలు(23)ని కూడా తోడుగా తీసుకెళ్లింది. వీరిద్దరిపై కన్నేసిన తండ్రీకొడుకులు మంత్రాల పేరుతో పూజలు చేసినట్లు నటిస్తూ.. లైంగికదాడికి పాల్పడ్డారు. బాధిత యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.