Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థలు రూ.1,01,043.69 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ 764.37 పాయింట్లు (1.33%) లాభ పడింది. విజయ దశమి సందర్భంగా బుధవారం స్టాక్మార్కెట్లు పని చేయలేదు.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 37,581.61 కోట్లు పెరిగి రూ.16,46,182.66 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.22,082.37 కోట్లు జత కలిసి, రూ.11,21,480.95 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.16,263.25 కోట్లు లాభ పడి రూ.6,10,871.36 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,433.27 వృద్ధి చెంది రూ. 6,14,589.87 కోట్ల వద్ద నిలిచింది.
హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,733.19 కోట్లు అభివృద్ధి చెంది రూ.4,22,810.22 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.4,623.07 కోట్లు పెరిగి రూ.7,96,894.04 కోట్లకు పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.326.93 కోట్లు వృద్ధి చెంది రూ.4,44,563.66 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,025.99 కోట్ల నష్టంతో రూ.6,10,623.53 కోట్లతో సరిపెట్టుకుంది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.3,532.65 కోట్లు తగ్గి రూ.4,41,386.80 కోట్లకు పరిమితమైంది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.624.73 కోట్లు కోల్పోయి రూ.4,73,316.78 కోట్లకు చేరుకున్నది.
టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లీడ్లో కొనసాగుతున్నది. తర్వాతీ జాబితాలో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ నిలిచాయి.