ముంబై : మహారాష్ట్ర అమరావతి జిల్లా వార్ధా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో మరో ఏడు మృతదేహాలను రెస్క్యూ బృందాలు గురువారం వెలికి తీశాయి. దీంతో ఘటనలో మృత్యువాతపడ్డ వారి సంఖ్య పదికి పెరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 13 మంది పడవలో ఉన్నారని పేర్కొన్నారు. మంగళవారం ఘటన చోటు చేసుకోగా.. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అదే రోజు మూడు మృతదేహాలను వెలికితీసినట్లు పేర్కొన్నారు.
మరో 11 ఏళ్ల బాలిక ఆచూకీ ఇంకా దొరకలేదని చెప్పారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు.. ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పారు. అమరావతిలోని బెనోడా పోలీస్స్టేషన్ పరిధిలోని వారూడ్ తహసీల్ పరిధిలో సంఘటన చోటు చేసుకున్నది. మృతులది గడెగావ్ గ్రామం కాగా.. 12 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు. పడవలో సమీపంలో ఉన్న జలపాతాన్ని సందర్శించిన తర్వాత ఆలయానికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పడవ ప్రమాదానికి గురైంది.