న్యూఢిల్లీ : యెమెన్లో అరెస్టయిన ఏడుగురు భారతీయ నావికులు విడుదలయ్యాయి. మూడునెలల పాటు హౌతీ తిరుగుబాటుదారుల చేతిలో బందీలున్న ఉన్న వారంతా ఆదివారం విడుదలయ్యారు. యెమెన్ రాజధాని సనాలో ఆదివారం విడుదలైన 14 మంది విదేశీయుల్లో ఏడుగురు భారతీయ నావికులు ఉన్నారని ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యిద్ అల్బుసైది పేర్కొన్నారు. ఈ ప్రాంతం ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుల ఆధీనంలో ఉన్నది.
మూడు నెలల కిందట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న తర్వాత యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు భారతీయ నావికులతో పాటు దేశాలకు చెందిన వారిని బంధీలుగా పట్టుకున్నారు. ఏడుగురు భారతీయులు సహా 14 మందిని విడుదల చేసినట్లు అల్బుసైది ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయంలో ఒమన్ చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.