వీర్ఖాది: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీండ్ జిల్లాలోని వీర్ఖాది గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో 13 మంది గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. గాయపడ్డ 13 మందిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని గ్వాలియర్ హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదం పట్ల విచారణ జరుపుతున్నట్లు భీండ్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు.