భోపాల్ : మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు ఏడు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఏడుగురిలో ముగ్గురు కరోనా టీకాలు తీసుకోగా.. ఇందులో సింగిల్ డోసు, రెండు మోతాదులు తీసుకున్నవారున్నారు. వ్యాక్సిన్ తీసుకోని నలుగురిలో ఇద్దరు ఆసుపత్రిలో చేరిన తర్వాత మృతి చెందగా.. మరో 22 ఏళ్ల మహిళతో పాటు రెండున్నరేళ్ల చిన్నారి వైరస్ను ఓడించారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మూడు భోపాల్, రెండు ఉజ్జయిని, రైసెన్, అశోక్నగర్ జిల్లాల్లో ఒక్కొక్క కేసును గుర్తించారు.
వీరంతా గత నెలలో కొవిడ్కు పాజిటివ్గా పరీక్షించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్కు నమూనాలను పంపగా.. జీనోమ్ సీక్వెన్సింగ్లో ఈ నెలలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖ కమిషనర్ ఆకాశ్ త్రిపాఠి మాట్లాడుతూ డెల్టా వేరియంట్ సోకిన ఏడుగురిలో ముగ్గురికి టీకాలు వేయగా.. హోంఐసోలేషన్లో ఉండి కోలుకున్నారన్నారు. ఇది కొత్త వేరియంట్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ల సమర్థతపై ఆశ పెంచుతుందన్నారు. ఇదిలా ఉండగా.. కేరళ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్లోనూ డెల్టా ప్లస్ కేసులు గుర్తించారు.