ముంబై, ఏప్రిల్ 25: వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో బ్లూచిప్ సంస్థల షేర్లు కుప్పకూలాయి. విదేశీ నిధులు వెళ్లిపోతుండటం, రూపాయి మరింత క్షీణత మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. నష్టాల్లో ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరి వరకు అదే పంతాను కొనసాగించింది. మధ్యాహ్నాం ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 617.26 పాయింట్లు లేదా 1.08 శాతం తగ్గి 56,579.89 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 218 పాయింట్లు(1.27 శాతం) పతనం చెంది 16,953.95 వద్ద జారుకున్నది.
6.47 లక్షల కోట్లు మటాష్
స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలతో మదుపరుల సంపద లక్షల కోట్లలో కరిగిపోయింది. వరుసగా రెండు సెషన్లలో సెన్సెక్స్ 1,300 పాయింట్లు నష్టపోవడంతో రూ.6 లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.647,484.72 కోట్లు తగ్గి రూ.2,65,29,671. 65 కోట్లకు పడిపోయింది.
ట్రేడింగ్ ముఖ్యాంశాలు