న్యూఢిల్లీ: కరోనా మలి విడుత వేవ్ భయాలు దేశీయ స్టాక్ మార్కెట్లను మరోమారు వెంటాడాయి. ఫలితంగా కొన్ని కన్జూమర్ సంస్థలు మినహా అన్ని స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అత్యధిక స్టాక్స్ నష్టాల బారిన పడ్డాయి. గురువారం బెంచ్మార్క్ ఇండెక్స్లు పతనం బాట పట్టాయి.
కేవలం మూడు గంటల్లోనే ఈక్విటీ ఇన్వెస్టర్లు రూ.4.6 లక్షల కోట్ల మేరకు నష్టపోయారు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.201.54 లక్షల కోట్లకు పడిపోయింది.
2023 వరకు కీలక వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగించాలని అమెరికా ఫెడ్ రిజర్వు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవడానికి సర్దుబాట్లకు దిగారు. మెరుగ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ను సైతం విక్రయించడానికి మొగ్గు చూపారు.
దేశీయంగా కొన్ని క్లస్టర్లలో కరోనా కేసులు పెరిగిపోయాయని వార్తలొచ్చిన నేపథ్యంలో మరోమారు లాక్డౌన్ విధిస్తే, ఆర్థిక వ్యవస్థ రికవరీ ప్రశ్నార్థకం అవుతుందని వ్యాపారుల్లో సందేహాలు వ్యక్తం అయ్యాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్డౌన్లు విధిస్తుండడం, ఆర్థిక రికవరీ భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి.
ఉదయం 49,067 పాయింట్ల వద్ద నష్టాల్లో స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 12.14 గంటల సమయంలో సెన్సెక్స్ 1,650.74 పాయింట్లు నష్టపోయింది. చివరికి 740.19 పాయింట్ల నష్టంతో 48,440.12 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 224.50 పాయింట్ల నష్టంతో 14,324.90 వద్ద స్థిరపడింది.
దేశీయ అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి షేర్ అత్యధికంగా 1.66 శాతం లాభ పడగా, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, నెస్టెల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్యూఎల్, సన్ ఫార్మా, శ్రీ సిమెంట్, ఇండియన్ ఆయిల్ తదితర స్క్రిప్ట్లు లబ్ది పొందాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్ భారీగా 4.08 శాతం నష్టపోగా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గెయిల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ పతనం అయ్యాయి.
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
పీఎస్యూల ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు : రాకేష్ జంఝన్వాలా
ఐసీఐసీఐ సంచలనం
వచ్చే ఏడాది వరకూ ఇంతే.. కొవిడ్-19 ఎఫెక్ట్పై మెజారిటీ సీఈవోలు
చందా కొచర్కు రిలీఫ్.. ఆమె భర్త దీపక్కు బెయిల్