న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోహింగ్యాలకు పునరావాసంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ (పీహెచ్పీ) తప్పుపట్టింది. వారిని వెంటనే దేశం నుంచి పంపేయాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాగా, రోహింగ్యాలను ఔటర్ ఢిల్లీలోని బక్కర్వాలాలోని అపార్ట్మెంట్లకు తరలిస్తామని గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. వారికి ప్రాథమిక సౌకర్యాలు, పోలీసు రక్షణ కల్పిస్తామని చెప్పారు. తిక్రీ సరిహద్దు సమీపంలోని బక్కర్వాలా ప్రాంతంలో ఇడబ్ల్యుఎస్ ఫ్లాట్లను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) నిర్మించిందని వెల్లడించారు.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ (పీహెచ్పీ) వ్యతిరేకించింది. ఇప్పటికే పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు ఢిల్లీలోని మజ్ను-కా-తిలా ప్రాంతంలో అధ్వాన్నమైన పరిస్థితులలో జీవిస్తున్నారని వీహెచ్పీ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఆరోపించారు. ఈ ప్రాంతం సరిహద్దులోని అపార్ట్మెంట్ ప్లాట్లను రోహింగ్యాలకు మంజూరు చేయాలని ప్రతిపాదించడం మరింత శోచనీయమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని కోరారు. రోహింగ్యాలకు గృహ వసతి కల్పించే బదులు వారిని భారత్ నుంచి వెనక్కి పంపే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
India has always welcomed those who have sought refuge in the country. In a landmark decision all #Rohingya #Refugees will be shifted to EWS flats in Bakkarwala area of Delhi. They will be provided basic amenities, UNHCR IDs & round-the-clock @DelhiPolice protection. @PMOIndia pic.twitter.com/E5ShkHOxqE
— Hardeep Singh Puri (@HardeepSPuri) August 17, 2022