హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : సెమ్స్ ఒలింపిక్స్ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు ఈ పోటీలు ఎంతో అవసరమన్నారు. గురువారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో సెమ్స్ ఒలింపిక్స్ బ్రోచర్ను ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకే పరిమితం కావొద్దని, అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. సెమ్స్ ఒలింపిక్స్ కన్వీనర్ ఆరుకాల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పోటీలపై ఆసక్తి ఉండి 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 8 వరకు www.semsolympiad.in నుంచి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సెమ్స్ ఒలింపిక్స్ కో ఆర్డినేటర్ ఎస్ఎన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు పీజే రెడ్డి, కే అనిల్కుమార్, బాణాల రాఘవ, గాయం భీష్మారెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి, కోశాధికారి రఘు సురేశ్, కడారి అనంతరెడ్డి, చింతల రాంచందర్, శేఖర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.