కాటారం, జూన్ 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు అంచ హన్మంతరావును అరెస్టు చేశారు. ఈ మేరకు కాటారం పోలీస్స్టేషన్ ఆవరణలో సోమవారం విలేకరుల సమావేశంలో సీఐ రంజిత్రావు వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గనికపూడి గ్రామానికి చెందిన అంచ హన్మంతరావు నస్తురుపల్లి గ్రామంలో 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. అందులో నిషేధిత పత్తి విత్తనాలను సాగు చేసేందుకు తీసుకువచ్చాడు. ఈక్రమంలో విశ్వసనీయ సమాచరంతో పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించగా.. హన్మంతరావు వద్ద నిషేధిత పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి.
ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి 3 కేజీల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ సీహెచ్ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి జీ రామకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి రాజన్న, సిబ్బంది ఉన్నారు.