వరంగల్ రూరల్ : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో అక్రమంగా నిలువ ఉంచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
పోలీసుల కథనం మేరకు..గ్రామానికి చెందిన వేమిశెట్టి రత్న సాగర్, ఇరుకు జితేందర్, గొట్టం భాగ్యమ్మ రేషన్ బియ్యం ఇండ్లలో నిల్వ చేశారనే సమాచారంతో సిబ్బందితో కలిసి వెళ్లి అక్రమ రేషన్ బియ్యం నిల్వలను గుర్తించినట్లు ఖానాపురం ఎస్సై సాయిబాబు తెలిపారు. గ్రామంలో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. బియ్యాన్ని సివిల్ సప్లైయ్ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.