సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల నిషేధిత గంజాయిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. జిల్లాలోని హుజూర్నగర్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు.
నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి గంజాయితో పాటు సెల్ఫోన్లు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందన్నారు. ఎవరైనా గంజాయిని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.