తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం విడుదల కావాల్సిన సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి నెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే టికెట్ల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
భక్తులు విషయాన్ని గమనించాలని కోరింది. అయితే కోటా రిలీజ్కు కాకపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో మాత్రమే టీటీడీ అందుబాటులో ఉంచుతోంది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తోంది. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని, ఇందులో భాగంగానే టికెట్ల కోటా పెంపును వాయిదా వేసినట్లు సమాచారం.