హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వ్యాసెక్టమీ) చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్గఢ్ మొదటిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో గత ఏడాది మొత్తం 3,600 వెసెక్టమీ సర్జరీలు జరిగాయి. వ్యక్తిగతంగా అత్యధిక సర్జరీలు చేసినందుకు హనుమకొండ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ యాకూబ్పాషాకు కేంద్రం ప్రత్యేక అవార్డు ప్రకటించింది. ఆయన ఇప్పటివరకు సుమారు 40 వేల సర్జరీలు నిర్వహించారు.
ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ‘నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ సమ్మిట్-2022’లో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్పవార్ చేతులమీదుగా రాష్ట్ర అధికారులు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు.
శాఖ సిబ్బందిని, డాక్టర్ యాకూబ్పాషాను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ కుటుంబ సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో వ్యాసెక్టమీ సర్జరీలు 0.4 శాతంగా ఉండగా.. తెలంగాణలో 1.6 శాతంగా ఉన్నాయి. జాతీయ సగటుకన్నా సుమారు నాలుగు రెట్లు అధికంగా రాష్ట్రంలో వ్యాసెక్టమీ సర్జరీలు జరుగుతున్నాయి.