న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. కరోనా నిబంధనలు, పూర్తి జాగ్రత్తల మధ్య సమావేశాలు నిర్వహిస్తామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లోక్సభ జరుగుతుందని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు ఏప్రిల్ 8 వరకు కొనసాగుతాయని వెల్లడించారు.
కాగా, జనవరి 29న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 29తో బడ్జెట్ తొలి దశ సమావేశాలు ముగిశాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.