ముంబై,జులై 2:మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(ఎస్ఈబీఐ) ఉల్లంఘనలకు పాల్పడేవారి వివరాలు ఇచ్చిన వ్యక్తులకు ఇచ్చే మనీ ప్రైజ్ ను పెంచింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు వెల్లడించే వ్యక్తులకు ప్రస్తుతం ఇస్తున్న బహుమతిని ఎస్ఈబీఐ పది రెట్లు పెంచింది. ఇప్పటి వరకు ఈ బహుమతి రూ.1 కోటి కాగా దీనిని రూ.10 కోట్లకు పెంచినట్లు తెలిపింది.
ప్రకటించిన రివార్డ్ రూ.1 కోటి,అంతకంటే తక్కువ ఉంటే తుది ఉత్తర్వులు జారీ అయిన తర్వాత రివార్డ్ మంజూరు ఉంటుంది. రూ.1 కోటి కంటే ఎక్కువ రివార్డ్ అయితే సెబి రూ.1 కోటి వరకు రివార్డ్ అందిస్తుంది. ఇది కూడా ఉత్తర్వులు జారీ అయ్యాక వస్తుంది. మిగతా మొత్తం ఆ తర్వాత వస్తుంది. స్వతంత్ర డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనలకు సవరణలతో సహా గుర్తింపు పొందిన ఇన్వెస్టర్లకు కొత్త నిబంధనావళిని పరిచయం చేసే చర్యలకు సెబి ఆమోదం తెలిపింది. రెసిడెంట్ ఇండియన్ ఫండ్ మేనేజర్స్ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లలో భాగంగా ఉండేందుకు అంగీకరించింది.