హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ పరిధిలో 25న (ఆదివారం) వివిధ మార్గాల్లో నడవాల్సిన 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు అయ్యాయి. లింగంపల్లి – హైదరాబాద్, హైదరాబాద్ – లింగంపల్లి, ఫలక్నుమా – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్నుమా మధ్య నడవాల్సిన రైళ్లను ఆపరేషనల్ కారణాలతో రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. లింగంపల్లి – హైదరాబాద్ మధ్య 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే
ప్రకటనలో పేర్కొంది.
హైదరాబాద్ – లింగంపల్లి మార్గంలో 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబరు గల రైళ్లను రద్దు తెలిపింది. ఫలక్నుమా – లింగంపల్లి మార్గంలో ఎనిమిది రైళ్లు రద్దు కాగా.. ఇందులో 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్లు గల రైళ్లను రద్దు చేసింది. లింగంపల్లి – ఫలక్నుమా మార్గంలో 47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192 నంబరు గల రైళ్లను రద్దు చేసినట్లు చెప్పింది. సికింద్రాబాద్ – లింగంపల్లి మార్గంలో (రైలు నంబర్ 47150), లింగంపల్లి – సికింద్రాబాద్ మార్గంలో (రైలు నంబర్ 47195) రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.