హైదరాబాద్ : స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఘన విజయం సాధించారు. తన మీద నమ్మకం ఉంచి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్కౌట్స్ అండ్ గైడ్స్లో విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరిగేలా కృషి చేస్తానన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రన్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో కలిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత 2015లో స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా తొలిసారిగా ఎన్నికయ్యారు. మరోసారి రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎన్నికవడం పట్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్, స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రన్గా వ్యవహరిస్తున్నారు.