అమరావతి : ప్రకాశం జిల్లా దర్శి గురుకుల పాఠశాల విద్యార్థి అస్వస్థకు గురై మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న ప్రవీణ్నాయక్ తీవ్ర అస్వస్థతకు గురై ఫిట్స్కు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతు మృతి చెందాడు. మృతుడు మార్కాపురం మండలం అక్కచెరువు తండావాసి అని సహచర విద్యార్థులు వెల్లడించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
అయితే విద్యార్థి అస్వస్థకు గల కారణాలపై పోలీసులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.