తలకొండపల్లి, ఆగస్టు 4: చిన్నారులు నిజాయితీని చాటుకొన్నారు. రోడ్డుపై దొరికిన రూ.14 వేలను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించి అందరిచే శభాష్ అనిపించుకొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం దేవునిపడకల్లోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న శ్రావణి, అక్షయ్ స్కూల్కు వెళ్తుండగా రోడ్డుపై రూ.14వేలు లభించాయి. వెంటనే వారు హెచ్ఎంకు అప్పగించారు.
ఈయన ఈ డబ్బులను పాఠశాల ఆవరణలోనే ఎస్సై శివశంకర్కు అందజేశారు. అం తకుముందే సురేశ్కుమార్ అనే వ్యక్తి తన డబ్బులు పో యినట్టు గ్రామస్థులకు చెప్పారు. డబ్బులు దొరికాయనే విషయాన్ని పోలీసుల ద్వారా తెలుసుకొన్న సురేశ్కుమా ర్.. చిన్నారుల నిజాయితీని మెచ్చి ఆ డబ్బులను తిరిగి పాఠశాల అభివృద్ధి కోసం విరాళంగా అందజేశారు.