మాక్లూర్, సెప్టెంబర్ 3 : కోతులకు భయపడి చెరువులో దూకిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలపరిధిలో చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం& అడవిమామిడిపల్లికి చెందిన దీపక్ డిగ్రీ చదువుతున్నాడు. ఇతను బొల్లి రాజేశ్ (12) అతని తమ్ముడు హన్మాండ్లు, అఖిలేశ్(12), అభిలాశ్తో గ్రామశివారులోని ఊరచెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు.
ఆ సమయంలో కోతులు గుంపులుగా రావడంతో భయంతో ఆ ఐదుగురు చెరువులోకి దూకారు. ఈత రాక మునిగిపోతున్న హన్మాండ్లు, అభిలాశ్ను దీపక్ ఒడ్డుకు చేర్చాడు. అనంతరం చెరువులో మునిగిపోయిన రాజేశ్, అఖిలేశ్ను దీపక్ అతికష్టం మీద ఒడ్డుకు చేర్చగా, రాజేశ్ అప్పటికే మృత్యువాతపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అఖిలేశ్ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించగా, అప్పటికే చని పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాజేశ్, అఖిలేశ్ డిచ్పల్లిలోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. దసరా సెలవులు కారణంగా వారు ఇంటికొచ్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.