సైబర్ నేరాలు ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరించాయి. అయితే.. మన దగ్గర సైబర్ క్రిమినల్స్ తమ నేరాలకు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఇన్ని రోజులు ఫిషింగ్ ఈమెయిల్స్ పంపించడం.. కాల్స్ చేసి అకౌంట్ వివరాలు అడగడం చేసేవారు. తాజాగా ఫిషింగ్ మెసేజ్లు పంపిస్తున్నారు. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది. వెంటనే అప్డేట్ చేసుకోండి. కేవైసీ అప్డేట్ చేసుకోండి… అంటూ లింక్స్ పంపిస్తున్నారు. అవి ఫిషింగ్ లింక్స్. ఆ లింక్స్ క్లిక్ చేస్తే.. బ్యాంక్ అపిషియల్ వెబ్సైట్కు పేజీ రీడైరెక్ట్ కాదు. సైబర్ క్రిమినల్స్ డెవలప్ చేసిన ఫేక్ పేజీ ఓపెన్ అవుతుంది.
ఆ పేజీనే నిజమైన బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ పేజీ అనుకొని కొందరు కస్టమర్లు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ను అందులో ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ కొడతారు. దీంతో ఆ వివరాలన్నీ సైబర్ క్రిమినల్స్ చేతికి వెళ్లిపోతాయి. యూజర్ ఎంటర్ చేసిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ను తస్కరించి వెంటనే ఆ వివరాలతో లాగిన్ అయి డబ్బులు కాజేస్తారు. ఈ కొత్త రకం సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పలుచోట్లు నమోదు అవుతున్నాయి.
చాలామంది కస్టమర్లకు ఎస్బీఐ యోనో అకౌంట్ బ్లాక్ అయిందని.. వెంటనే పాన్ కార్డును అప్డేట్ చేసుకోవాలంటూ మెసేజ్లు వస్తుంటాయి. వాటికి అస్సలు రెస్పాండ్ కావొద్దని.. ప్రైవేటు నెంబర్ల నుంచి అటువంటి మెసేజ్లు వస్తే వెంటనే సంబంధిత నెట్వర్క్ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఆ నెంబర్పై ఫిర్యాదు ఇస్తే వెంటనే ఆ నెంబర్ను కంపెనీ బ్లాక్ చేస్తుందని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
OnePlus Nord 2 : మళ్లీ పేలిన వన్ప్లస్ నోర్డ్ 2 స్మార్ట్ఫోన్..
Xiaomi 12 : ఏడాది చివరన ఎంట్రీ ఇవ్వనున్న షియోమి 12
Facebook : పేరు మార్చిన కొన్ని రోజులకే ఫేస్బుక్కు బిగ్ షాక్..