హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. ఎస్సీ యువత రిజర్వేషన్ కోటాలోనే కాకుం డా ఓపెన్లో కూడా ఉన్నత ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దాలంటూ సూచించారు.
ఎస్సీ సంక్షేమ శాఖ, స్టడీసరిల్ పనితీరుపై సంబంధిత అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల గురువారం సమీక్షించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా, స్టడీ సరిల్ డైరెక్టర్ వేణుగోపాల్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చే విధంగా ఆయా అంశాల్లో నిపుణులైన వారి చేత ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని అధికారులకు తెలిపారు. ఓవర్సీస్ సాలర్షిప్స్ను త్వరితగతిన మంజూరు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో వసతులను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు.
హాస్టళ్లలో విద్యార్థుల సౌకర్యార్థం డిజిటల్ క్లాస్రూంలు, సౌరశక్తితో నడిచే వాటర్ హీటర్లు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ‘సహజ’ పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి మంత్రి ఈ సందర్భంగా వివరించారు. చౌకగా లభించే నాణ్యమైన ఆ ఉత్పత్తులను గురుకులాలు, హాస్టళ్లకు అందిస్తే బాగుంటుందని, ఈ అంశాన్ని పరిశీలించాలని మంత్రి అన్నారు.