న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ బ్యాంకింగ్ ( SBI online banking ) సేవలు రెండు గంటల పాటు నిలిచిపోయనున్నాయి. నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలు చేపడుతుండటం వల్ల ఈ రెండు గంటలూ ఆన్లైన్ బ్యాంకింగ్ పని చేయదని ఎస్బీఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకూ 120 నిమిషాల పాటు పని చేయదని తెలిపింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పింది. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఈ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అయితే వరుసగా మూడో నెల కూడా ఎస్బీఐ ఇలా నిర్వహణ కార్యకలాపాలు చేపడుతుండటం వల్ల డిజిటల్ సేవలకు ఆటంకం కలుగుతోంది.