న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) .. ఎవరికైనా వ్యక్తులు లేదా సంయుక్తంగా బంగారం కోనం దరఖాస్తు చేసుకున్న వారికి పలు రాయితీలు కల్పిస్తున్నది. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి రుణ పరపతినిస్తున్నది. బ్యాంకులు విక్రయించే బంగారం నాణాలతోపాటు ఆభరణాల కొనుగోళ్లకు ఈ రుణం తీసుకోవచ్చు. బంగారం కోసం రుణం తీసుకునే బ్యాంకు ఉద్యోగులు, పెన్షనర్లు ఎటువంటి గుర్తింపు కార్డులు జత చేయవసరం లేదు. ఎస్బీఐ యాప్ యోనో ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపునిస్తున్నది.
రుణాలకు దరఖాస్తు అర్హతలు ఇవే:
ఎస్బీఐ గోల్డ్ లోన్ ఫీచర్లు ఇవే:
బంగారంపై ఇచ్చే రుణానికి ఎస్బీఐ తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది. రుణ మొత్తంలో 0.25 శాతం వడ్డీతోపాటు కనీసంగా జీఎస్టీ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.
బంగారం ఆభరణాలు భద్రత కల్పిస్తాయి. రుణ చెల్లింపులు పూర్తయిన తర్వాత మన చేతికి వస్తాయి. ఈ రుణంతో ఎవరికీ నష్టం లేదు.
మార్జిన్లు:
గోల్డ్ లోన్: 25%
లిక్విడ్ గోల్డ్ లోన్: 25%
బుల్లెట్ రీపెమెంట్ గోల్డ్ లోన్:35%
గోల్డ్, లిక్విడ్ గోల్డ్ లోన్లు మూడేండ్లలోనూ, బుల్లెట్ పేమెంట్ గోల్డ్ లోన్ 12 నెలల్లోపు చెల్లించాల్సి ఉంటుంది.
అన్ని రకాల బంగారం రుణాలపై 7.5 శాతం వడ్డీ వసూలు చేస్తుంది ఎస్బీఐ. అయితే రియాల్టీ గోల్డ్ లోన్ పథకం కింద ఇంటి కోసం బంగారం రుణం తీసుకునే వారికి 7.3 శాతం వడ్డీ అమలు చేస్తున్నది. మిస్డ్ కాల్ ఇచచినా, ఎస్ఎంఎస్ పంపినా ఎస్బీఐ గోల్డ్ లోన్ మంజూరవుతుంది. ఎస్బీఐ గోల్డ్ లోన్ సమాచారం కోసం 7208933143 అనే నంబర్కు మిస్డ్ కాల్ కానీ, 7208933145 అనే నంబర్కు గోల్డ్ అని ఎస్సెమెస్ పంపాల్సి ఉంటుంది.