న్యూఢిల్లీ, అక్టోబర్ 15: బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మరోసారి రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును పావు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. సవరించిన వడ్డీరేట్లు శనివారం నుంచే అమలులోకి వచ్చాయి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రుణ గ్రహీతల నెలవారి చెల్లింపులు మరింత అధికంకానున్నాయి. ఖాతాదారులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలనే ఉద్దేశంతో 2016లో రిజర్వు బ్యాంక్.. ఎంసీఎల్ఆర్ని ప్రవేశపెట్టింది.