హుజూరాబాద్: ఈటల రాజేందర్ మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ది ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.మంగళవారం హుజురాబాద్ లోని పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్నే గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వాన్నే ఆదరించి గెలిపించాలన్నారు.
పార్టీని వదిలి బీజేపీలో చేరిన ఈటలకు ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెప్పాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్కే ప్రజామద్దతు ఉన్నదని గెల్లు శ్రీనివాస్యాదవ్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన టోపీరాంబాబు ఆయనను కలువగా తెలంగాణ ఉద్యమం నుండి టోపీ ద్వారా ప్రచారం చేస్తున్న రాంబాబును అభినందించారు.