హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న బీ సైదులు సస్పెండ్ అయ్యారు. కేసుల విషయంలో డబ్బులు తీసుకోవడంతోపాటు ప్రవర్తన సరిగా లేకపోవడం, క్రిమినల్ కేసుల్లో సెటిల్మెంట్లు తదితర అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ఎస్సై సైదులును సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.