హైదరాబాద్ , మే 25 : బ్రీత్ ఇండియా భాగస్వామ్యం తో రోటరీ క్లబ్ సహకారంతో వరంగల్ లో శరత్ మాక్సివిజన్ ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేసింది . కోవిడ్ -19 రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని చూసిన తరువాత డాక్టర్ మేఘనా చిలుకురి , డాక్టర్ శరత్ బాబు అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సస్ట్రేటర్స్ లను అందించడానికి బ్రీత్ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు . రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సహకారంతో ప్రీత్ ఇండియాతో కలిసి ఆక్సిజన్ బ్యాంక్ ను ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయటం జరిగింది . ఈ ఆక్సిజన్ బ్యాంక్ వరంగల్ లోని కరోనా రోగుల ఆక్సిజన్ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.
ఈ సందర్భంగా శరత్ బాబు చిలుకురి మేనేజింగ్ డైరెక్టర్ శరత్ మాక్సివిజన్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి భారతదేశంలో భయంకరంగా మారిందని అన్నారు. ఈ క్లిష్టమైన సమయంలో సమాజంలో తమ సేవలను అందించే బాధ్యత దేశంలో ప్రతి ఒక్కరికీ ఉంది. ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచనని హనమకొండ ,వరంగల్ సెంట్రల్ కు చెందిన రోటరీ క్లబ్ సభ్యులు స్వాగతించారు . తరువాత కుటుంబ సభ్యులు ,స్నేహితులందరూ ఈ ప్రాజెక్ట్ కోసం ఉదారంగా సహకరించారు.
శరత్ మాక్సివిజన్ డైరెక్టర్ డాక్టర్ మేఘనా చిలుకురి మాట్లాడుతూ మాజీ రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ శరత్ బాబు , ప్రాజెక్ట్ చైర్మన్ ఈ ప్రాజెక్టులో ప్రధాన దాత , అతను బ్రీత్ ఇండియాతో సమన్వయం చేసుకుని ఆక్సిజన్ బ్యాంకును స్థాపించారు. వరంగల్ లోని హనమ్ కొండలోని శరత్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్ లో రోనరీ క్లబ్ ఆఫ్ హనమ్ కొండ ఆధ్వర్యంలో , ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేయటం జరిగింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు నామమాత్రపు ఖర్చుతో అవసరమైన వారందరికి పంపిణీ చేయనున్నామని అన్నారు. వరంగల్ లో 100 ఆక్సిజన్ కాన్సస్టేటర్స్ లను తయారు చేసి , అదే ప్రాజెక్టును ఖమ్మం, కరీంనగర్ లో త్వరలో ప్రారంభించాలనే ఆలోచన ఉందని తెలిపారు.