న్యూఢిల్లీ : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కుమారుడు ఇజ్హన్కు ఇంగ్లండ్ వీసా జారీ చేసింది. కుమారుడితో పాటు సోదరి ఆనమ్కు వీసాలు రావడంతో.. ఇక సానియా మీర్జా ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనున్నది. ప్రస్తుతం ఇంగ్లండ్లో టెన్నిస్ సీజన్ నడుస్తోంది. ఆ తర్వాత వింబుల్డన్, టోక్యో ఒలింపిక్స్లోనూ సానియా ఆడాల్సి ఉంది. కానీ ఇండియాలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తొలుత సానియా కుమారుడికి, ఆమె కేర్టేకర్కు ఇంగ్లండ్ వీసాలు జారీ చేయలేదు. దీంతో సానియా కేంద్ర ప్రభుత్వం జోక్యం కోరింది. కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ, విదేశాంగ శాఖలను తన కుమారుడికి వీసా ఇప్పించాలంటూ సానియా అభ్యర్థించింది. ఈ అంశాన్ని ఇంగ్లండ్ విదేశాంగ శాఖతో చర్చించిన ప్రభుత్వం.. సానియా కుమారుడికి వీసా ఇప్పించింది. ఈ నేపథ్యంలో తన కుమారుడికి వీసాలు ఇప్పించిన కేంద్ర క్రీడాశాఖ, విదేశాంగ శాఖలకు సానియా థ్యాంక్స్ చెప్పింది. మంత్రి కిరణ్ రిజిజూ ట్విట్టర్లో స్పందిస్తూ.. నువ్వు సాధించిన ఘనతల పట్ల దేశం గర్వంగా ఫీలవుతోందని, ఇండియాకు ఎంతో కీర్తిని తీసుకువచ్చినట్లు మంత్రి అన్నారు. ఒలింపిక్స్కు ప్రిపేరవుతున్న నీకు విషెస్ చెబుతున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు.