మనోహరాబాద్, అక్టోబర్ 22 : మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెం, పర్కిబండ, తుపాకులపల్లి గ్రామంలోని చెరువులో చేప పిల్లలను వదిలారు. రూ. 6 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు భూమి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధం గా కుల వృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరువ చూపుతున్నారన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రతి ఏటా కోట్ల్ల రూపాయలతో చేపపిల్లలను చెరువుల్లో ఉచితంగా వదులుతున్నారన్నారు. జిల్లాలో 1636 చెరువులు, కుంటలు, వాగుల్లో ఈ ఏడాది రూ. 4 కోట్ల 50 లక్షలతో 5 కోట్ల 33 లక్షల చేపపిల్లలను వదలనున్నట్లు తెలిపారు.
తూప్రాన్ మండలంలో…
ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగాలని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి అన్నారు. తూప్రాన్ మండలంలోని యావాపూర్, ఘనపూర్ చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. కార్యక్రమంలో మత్స్యశా ఖ జిల్లా అధికారి మల్లేశం, డైరెక్టర్ గడప దేవేందర్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపీపీలు గడ్డి స్పప్నావెంకటేశ్, పురం నవీనతరవి ముదిరాజ్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు బాబుల్రెడ్డి, సర్పంచ్లు బొడ్డు వెంకటేశ్వ ర్లు, అర్జున్, పుష్పలతనవీన్, నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, నాయకుడు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
రైతు బీమాతో పేద కుటంబాలకు భరోసా
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
తూప్రాన్/రామాయంపేట, అక్టోబర్ 22: రైతుబీమాతో రాష్ట్రంలోని మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలను ఇచ్చి ఆదుకుంటూ సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారని రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. తూప్రాన్ పట్టణంలోని రైతువేదికలో రైతు బీమా పత్రాలను మృతుల కుటుంబాలకు అందజేశారు.అనంతరం అక్కడి నుంచి నేరుగా పెద్ద చెరువులో మత్స్యకారులతో కలిసి చెరువులో చేపపిల్లను వదిలారు.
రైతుల్లో మార్పులు రావాలనే రైతు వేదికలు
రాష్ట్రంలోని రైతుల్లో మార్పులు రావాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రైతువేదికలను నిర్మిస్తున్నారని రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. తూప్రాన్ పట్టణంలోని పెద్ద చెరువులో చేపపిల్లలను వదిలి విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు అభివృద్ధి కోసం చేపపిల్లలను అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వానకాలం రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందన్నా రు. కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్, వైస్ చ్మైన్ శ్రీనివాస్, నర్సాపూర్ ఏడీఏ సురేఖ, ఏవో నుస్రత్, రైతు బంధు అధ్యక్షుడు సురేందర్రె డ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు రాజు పంతులు, మండల టీ ఆర్ఎస్ అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, తూప్రాన్ పట్టణాధ్యక్షు డు సతీష్చారి, యాదిరెడ్డి, ఏఈవోలు సంతోష్, సింధు, టీఆర్ఎస్ నాయకులు దుర్గారెడ్డి, కృష్ణ, రఘుపతి తది తరులు ఉన్నారు.