30శాతం ఫిట్మెంట్పై ఉద్యోగుల సంబురాలు
ఉమ్మడి జిల్లాలో 35వేల మంది ఉద్యోగులు
సిద్దిపేట జిల్లాలో 14,244మంది, మెదక్లో 10,125, సంగారెడ్డిలో 10,853 మందికి ప్రయోజనం
ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటనపై ఆనందం
ఉద్యోగ, ఉపాధ్యాయుల హర్షం
సిద్దిపేట, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ కల్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్ సోమవారం శాసనసభలో ప్రకటించారు. ఈ ప్రకటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు. రిటైర్మెం ట్ వయో పరిమితిని 58ఏండ్ల నుంచి 61ఏండ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనతో ఎంతో మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. మరో వారంలో రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు ఇది ఒక వరం. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చే స్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడంతో పాటు స్వీట్లు పంచి, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. టీఎన్జీవోస్, ఉపాధ్యాయులు, ఇతర అన్ని శాఖల ఉద్యోగులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి సుమారుగా 9వేల మంది ఉద్యోగులు, 5,244 మంది పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్ 600మంది, మెదక్ జిల్లాలో 6,780మంది ఉద్యోగులు, 3,345 మంది పెన్షనర్లు ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 10,853 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సుమారుగా 35,222మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరు కాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారుగా మరో 1500 నుంచి 2వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని శాఖల ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. పక్క రాష్ర్టాల కన్న మెరుగైన ఫిట్మెంట్ను సీఎం కేసీఆర్ ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ప్రకటనతో మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామంటున్నారు. తమపై మరింత బాధ్యత పెరిగిందని అన్ని శాఖల ఉద్యోగులు చెబుతున్నా రు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పని చేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశవర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యావలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్, వీఆర్ఏలు, వీఏఓలు, గ్రాంట్ ఇన్ ఎ యిడ్ తదితర ఉద్యోగులందరికీ వర్తించేలా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో పాటుగా అర్హులైన వారందరికీ ప్రమోషన్లు రానున్నాయి. ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించడంతో ఉద్యోగులు, నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్ జిల్లాల బదిలీ లు, కేజీవీబీల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు వేతనంలో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఉద్యోగులపై తనకున్న అభిమానాన్ని మరోసారి సీఎం కేసీఆర్ చాటుకున్నారు.