సంగారెడ్డి, అక్టోబర్ 21 : ఇంటర్మీయెట్ మొదటి సంవత్సరం పరీక్షలు కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురు వారం మంత్రి హైదరాబాద్ నుంచి అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, సౌకర్యాలు మెరుగుపర్చాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్కు శానిటైజ్ చేయాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారితో పరీక్షలు నిర్వహించేలా చూడాలన్నారు. పరీక్షలను ప్రశాంతంగా రాసి తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చాలని, విద్యార్థులకు మంత్రి ధైర్యం కల్పించారు.
పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి : సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
జిల్లాలో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ హనుమంతరావు మంత్రికి వివరించారు. జిల్లాలో 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షలు రాసే విద్యార్థులు 16,255 మంది పాల్గొంటారని, ప్రభుత్వ జూనియర కళాశాలలు 26, ప్రైవేట్ కళాశాలల్లో 20, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠవాల, ప్రైవేట్ పాఠశాలల్లో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి సిద్ధం చేశామన్నారు. పరీక్షా పత్రాల నిల్వకు 18 స్టోరేజీ పాయింట్స్ ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఏఎన్ఎం శానిటైజర్, మాస్క్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్, థర్మల్ స్కానర్తో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రికి కలెక్టర్ వివరించారు. ఆయా ప్రాంతాల నుంచి బస్సులను నడిపేలా ఆర్టీసీ యాజమాన్యానికి, పరీక్ష సమయంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేసేలా విద్యుత్ అధికారులకు సూచించామని మంత్రికి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి గోవింద్రామ్, అనుబంధశాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 21 : ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతవాతావరణంలో నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్ నుంచి ఇంటర్ పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాలన్నారు. జ్వరం లక్షణాలు గల విద్యార్థులకు ప్రత్యేక గదిని కేటాయించాలని, ప్రథమ చికిత్సకు వైద్యులతో పాటు అంబులెన్స్ను సైతం అందుబాటులో ఉంచాలని సూచించారు. మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ జిల్లాలో 7211 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తున్నారని, వీరికి జిల్లాలో 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 13 పోలీస్ స్టేషన్లలో పరీక్షా పత్రాలను భద్రపర్చించేందుకు తగు ఏర్పాట్లు చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విద్యాశాఖ కమిషనర్ అహ్మద్ జలీల్, జిల్లా ఆదపు ఎస్పీ కృష్ణామూర్తి, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్, మెదక్ ఆర్డీవో సాయిరాం, పోస్టాఫీస్ సూపరింటెండెంట్ సంపత్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.