ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
రాష్ట్ర బడ్జెట్లో అన్నివర్గాలకు సముచిత స్థానంపై హర్శం
అందోల్ క్యాంప్ కార్యాలంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
అందోల్, మార్చి 19: 2021- 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రప్రభ్వుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉన్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఈ బడ్జెట్ అన్నివర్గాల సంక్షేమం, అట్టడుగు వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించేదిగా ఉన్నదని చెప్పా రు. ఈ సందర్భంగా శుక్రవారం అందోల్లోని తన క్యాం ప్ కార్యాలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉండేలా బడ్జె ట్ రూపొందించడం జరిగిందన్నారు. సాగునీటికి, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం బడ్జెట్లో కేటాయింపులు ఉండడం సంతోషకరమన్నారు. కాళేశ్వరం నుంచి సింగూర్కు వచ్చే కాల్వ నిర్మాణానికి బడ్జెట్ ఊతమిచ్చేదిగా ఉన్నదని చెప్పిన ఎమ్మెల్యే, ఇది బడుగు, బలహీనవర్గాల ప్రజల బడ్జెట్ అని అభివర్ణించారు.
గత ప్రభుత్వాల హయాంలో నిర్వీర్యమైన స్థానిక సంస్థలకు సైతం నిధులు కేటాయించి పునరుజ్జీవం పోయడంతోపాటు ఎమ్మెల్యేల కు సైతం అభివృద్ధిపనుల కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దళిత్ ఎంపవర్మెంట్ ద్వారా రూ.వెయ్యికోట్లు కేటాయించడం శుభపరిణామమని, ఈ నిధులతో దళితులు అన్ని రంగాల్లో మరింత ఆర్థికాభివృద్ధి సాధిస్తారన్నారు. బడ్జెట్లో అన్ని వర్గాలకు సముచితస్థానం కల్పించడం ద్వారా ప్రజా సంక్షేమంపై కేసీఆర్కు ఉన్న శ్రద్ధ మరోసారి నిరూపితమైందని చెప్పిన ఎమ్మెల్యే, ప్రజామోద బడ్జెట్ను రూపొందించిన మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్కు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు క్యాంప్ కార్యాలయంలో స్వీట్లు పంచి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు భిక్షపతి, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, వైస్ ఎంపీపీ మహేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం, ఎంపీటీసీ కృష్ణాగౌడ్, కో- ఆప్షన్ సభ్యుడు ఫైజల్, కౌన్సిలర్లు చందర్, పార్టీ నేతలు ఉన్నారు.