హైదరాబాద్: వ్యాపారవేత్త, సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీధర్ తనఫై అత్యాచారం చేసాడంటూ జిమ్ ట్రైనర్ ఆర్య చౌదరి ఫిర్యాదు చేసింది. తనను లొంగదీసుకుని రేప్ చేసాడని సనత్ నగర్ పీఎస్లో ఆమె ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసి ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని వెల్లడించింది.
జిమ్ ట్రైనర్గా ఉన్న ఆర్య చౌధరి.. అక్టోబర్ నెల నుండి శ్రీధర్ దగ్గర బాడీ గార్డ్గా పనిచేస్తోంది. తనపై అత్యాచారం చేసిన శ్రీధర్ఫై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు.. శ్రీధర్ఫై ఐపీసీ సెక్షన్లు 377, 341, 323, 506 కింద కేసు నమోదు చేశారు.