ముంబై: శాంసంగ్ కంపెనీ గతేడాది విడుదల చేసిన మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ M31s ధరను భారత్లో రూ.1000 తగ్గించింది. గత ఏడాది జూలైలో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.19,499గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ గెలాక్సీ ఎం31ఎస్ ఫోన్ ఇప్పుడు రూ .18,499కు లభించనుంది. రూ .21,499 ధర కలిగిన 8 జీబీ ర్యామ్+128 జీబీ మోడల్ ఇప్పుడు రూ .20,499 అందుబాటులో ఉంది. M31S ధరల తగ్గింపు ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్లలో వర్తిస్తుంది.