సౌత్కొరియా మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ M సిరీస్లో మరో కొత్త గెలాక్సీ ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. బడ్జెట్ ధరలో గెలాక్సీ M12 స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బేస్ మోడల్ 4GB ర్యామ్+ 64GB స్టోరేజ్ ఫోన్ ధర రూ.10,999 కాగా, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499గా నిర్ణయించారు. 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6,000mAh బ్యాటరీ, శాంసంగ్ ఎక్సీనోస్ 850 SoC ప్రాసెసర్తో వస్తోంది. మార్చి 18 నుంచి భారత్లో ఫోన్ల విక్రయాలు ప్రారంభంకానున్నాయి. అమెజాన్ ఇండియా, శాంసంగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. అట్రాక్టివ్ బ్లాక్, ఎలిగాంట్ బ్లూ, ట్రెండీ ఎమరాల్డ్ గ్రీన్ కలర్లలో అందుబాటులో ఉంది.