ముంబై: సౌత్కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ A సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత్లో ఆవిష్కరించింది. మిడ్రేంజ్ ఫోన్లలో 64 మెగా పిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, స్నాప్డ్రాగన్ 720జీ ప్రాసెసర్, పంచ్ హోల్ అమోలెడ్ డిస్ప్లే వాటర్ రెసిస్టెంట్ డిజైన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
రెండు స్మార్ట్ఫోన్లు బ్లాక్, వైలెట్, వైట్, బ్లూ కలర్లలో అందుబాటులో ఉంటాయి.
భారత్లో 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్ వేరియంట్ గెలాక్సీ A52 ధర రూ. 26,499గా ఉంది. అలాగే 8GB + 128GB కాన్ఫిగరేషన్ మోడల్ ధర రూ. 27,999గా నిర్ణయించారు. 8GB + 128GB వేరియంట్ గెలాక్సీ A72 ధర రూ.34,999 కాగా, 8GB + 256GB మోడల్ ధర రూ.37,999గా ఉంది. లాంచ్ ఆఫర్లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా గెలాక్సీ A72 ఫోన్ను కొనుగోలు చేస్తే 3వేల వరకు క్యాష్బ్యాక్ లభించనుంది. A52 ఫోన్లపై 2వేల వరకు క్యాష్బ్యాక్ వర్తించనుంది.