బోధన్ రూరల్, సెప్టెంబర్ 27: సాలూరాను నూతన మండలంగా ఏర్పాటుచేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు మంగళవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
అనంతరం పటాకులు కా ల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకొన్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎంపీపీ బు ద్దె సావిత్రీరాజేశ్వర్, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ మాట్లాడుతూ.. బోధన్ మండలాన్ని విభజిం చి పది గ్రామాలతో కలిపి సాలూరాను నూతన మండలంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్నో ఏండ్ల కలను సాకారం చేసినందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్కు కృతజ్ఞతలు తెలిపారు.
రైతు బంధు సమితి మండల మాజీ కన్వీనర్ బుద్దెరాజేశ్వర్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు నర్సన్న, ఎంపీటీసీ కండెల సవి త, సొసైటీ చైర్మన్ అల్లే జనార్దన్, ఆయా గ్రామా ల సర్పంచులు చింతపు నాగయ్య, గంగాధర్, బుయ్యన్ సురేశ్, సాలంపాడ్ రవి, శ్రీనివాస్రెడ్డి, కేజీ గంగారాం, బొర్ర గంగారాం, బిల్లా హన్మాం డ్లు, అంతయ్య తదితరులు పాల్గొన్నారు.