బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆయన కుర్ర హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. ఒకవైపు హీరోగా మూవీస్ చేస్తూనే మరోవైపు నిర్మాతగాను వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. అయితే సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యాంటీమ్’ అనే చిత్రం నవంబర్ 26న విడుదలైంది. ఇందులో సల్మాన్ ఖాన్ పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కన్పించారు.
అల్టిమేట్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్రానికి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెస్పాన్స్ పక్కన పెడితే థియేటర్లో ఆయన అభిమానులు చేసిన పిచ్చిపనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.సల్మాన్ కూడా వారు చేసిన పిచ్చి పనిపై మండిపడ్డారు. సల్మాన్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో ‘యాంటీమ్’ ప్రదర్శితం అవుతున్న ఒక థియేటర్లో అభిమానులు టపాసులు పేలుస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో మిగతా ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు.
దీనిపై సల్మాన్ మాట్లాడుతూ… థియేటర్లో టపాసులు పేల్చడం మీ చుట్టుపక్కల ఉన్న వారికి ప్రమాదకరం. థియేటర్ల యజమానులు ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదు. ఎంట్రీలోనే ఇలాంటి పనులు చేయకుండా అడ్డుకోవాలి. సినిమాను ఎంజాయ్ చేయండి కానీ ఇలా కాదు. అభిమానులకు ఇదే నా రిక్వెస్ట్ అని సల్మాన్ చెప్పుకొచ్చారు.
https://www.instagram.com/tv/CWyH7ttomwV/?utm_source=ig_web_copy_link