ఎప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)చాలా కాలం తర్వాత హైదరాబాద్లో ఉండేందుకు ఎక్కువ టైం కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కభీ ఈద్ కభీ దివాళి ( Kabhi Eid Kabhi Diwali)సినిమా షూటింగ్ కోసం సిటీలో ఉన్నాడు సల్లూభాయ్. పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోండగా..విక్టరీ వెంకటేశ్ కీ రోల్ చేస్తున్నాడు.
ఇక సల్మాన్ షూటింగ్ నుంచి ఏ మాత్రం బ్రేక్ దొరికినా ఇతర స్టార్ హీరోలను కలుస్తున్నాడు. ప్రైవేట్ పార్టీలకు హాజరవుతున్నాడు. ఇండస్ట్రీలో చాలా ఏండ్ల నుంచి మంచి అనుబంధం కొనసాగిస్తున్న కోస్టార్లు, వారి ఫ్యామిలీస్ను కలుస్తున్నాడు. తాజాగా ఈ స్టార్ హీరో టాలీవుడ్ హీరో రాంచరణ్-ఉపాసన దంపతుల(Ram Charan-Upasana )ను కలిశాడు. సల్మాన్, పూజాతోపాటు వెంకటేశ్ కూడా చరణ్ కపుల్ను కలిసిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
కభీ ఈద్ కభీ దివాళి చిత్రంలో వచ్చే స్పెషల్ సాంగ్లో రాంచరణ్ కనిపించబోతున్నాడని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా రాంచరణ్తో సల్మాన్, పూజా కనిపించడం ఈ ఊహాగానాలు నిజమేనని చెప్తున్నాంటున్నారు సినీ జనాలు.
Read Also : Prithviraj Sukumaran | సలార్ స్క్రిప్ట్ అద్బుతం..తెలుగులో ఇంట్రెస్టింగ్ ఆఫర్లొస్తున్నాయి : పృథ్విరాజ్